Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్ కేసులు ... దేశంలో భారీగా కోవిడ్ కేసులు

Advertiesment
ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్ కేసులు ... దేశంలో భారీగా కోవిడ్ కేసులు
, ఆదివారం, 9 జనవరి 2022 (14:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరింది. ఈ కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 కేసులు నమోదుకాగా, తర్వాత స్థాంలో ఢిల్లీ 513 కేసులతో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో 123 ఒమిక్రాన్ కేసులు ఉండగా, కర్నాటకలో 441, రాజస్థాన్ రాష్ట్రంలో 373, కేరళలో 333, గుజరాత్‌లో 204 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 1,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
దేశంలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి 40,863 మంది కోలుకున్నారు. ఈ కొత్త కేసులతో కలుపుకంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,53,603కు చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల వేళ రైతులకు యూపీ సీఎం యోగి వరాలు