Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి జగన్‌ పర్యటన : టూర్ వివరాలు ఇవే...

Webdunia
శనివారం, 17 జులై 2021 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఆ దిశగా శరవేగంగా పనులు చేపట్టింది. ఈ క్రమంలో ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ సీఎం జగన్ భావించారు. 
 
అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆయన పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
 
సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 19వ తేదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ కాఫర్ డ్యామ్, ప్రాజెక్టు వివిధ భాగాలను సందర్శిస్తారు. ఆపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టరులో తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం