Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయితే ఓకే.. అమరావతిలో 14న కేబినెట్ భేటీ...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (17:22 IST)
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గ సమాచారం నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
 
కేబినెట్‌ భేటీకి అజెండానే కీలకమని... అజెండాలోని అంశాల ఆధారంగానే ఈసీ అనుమతిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో అజెండాలోని అంశాలపై సీఎంవోను సీఎస్‌ వివరణ కోరారు. ఏయే అంశాలపై కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నదీ ఈసీకి చెప్పాల్సి ఉందన్నారు. అజెండా వివరాలు వచ్చాక ఈసీకి పంపించి  భేటీకి సంబంధించిన అనుమతి కోరనున్నారు సీఎస్. అయితే, కేబినెట్‌ సమావేశం పెట్టే స్థాయి నిర్ణయాలు ఉంటేనే ఈసీ అనుమతిస్తుందని ఎల్వీ చెప్పారు. 
 
అయితే, తాజా సమాచారం మేరకు ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్ అంశాలు ఎన్నికల సంఘానికి 48 గంటల ముందు వెల్లడించాల్సి వుండటంతో ఈనెల 10వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments