Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయితే ఓకే.. అమరావతిలో 14న కేబినెట్ భేటీ...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (17:22 IST)
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గ సమాచారం నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
 
కేబినెట్‌ భేటీకి అజెండానే కీలకమని... అజెండాలోని అంశాల ఆధారంగానే ఈసీ అనుమతిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో అజెండాలోని అంశాలపై సీఎంవోను సీఎస్‌ వివరణ కోరారు. ఏయే అంశాలపై కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నదీ ఈసీకి చెప్పాల్సి ఉందన్నారు. అజెండా వివరాలు వచ్చాక ఈసీకి పంపించి  భేటీకి సంబంధించిన అనుమతి కోరనున్నారు సీఎస్. అయితే, కేబినెట్‌ సమావేశం పెట్టే స్థాయి నిర్ణయాలు ఉంటేనే ఈసీ అనుమతిస్తుందని ఎల్వీ చెప్పారు. 
 
అయితే, తాజా సమాచారం మేరకు ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్ అంశాలు ఎన్నికల సంఘానికి 48 గంటల ముందు వెల్లడించాల్సి వుండటంతో ఈనెల 10వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments