Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశం

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం గురువారం ఒక్క రోజు మాత్రమే జరుగనుంది. ఇందులో ఏకంగా 14 బిల్లులను ఆమోదించనున్నారు. వాస్తవానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ నిర్వహించాలనే నిబంధన ఉంది. దీంతో శాసనసభ గురువారం సమావేశం కానుంది. అయితే.. ఈసారి కూడా ఒక్కరోజుకే సభా వ్యవహారాలను పరిమితం చేయనున్నారని తెలిసింది. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన విష యం గమనార్హం. 
 
ఇక, తాజాగా నిర్వహించనున్న సభకు సంబంధించి సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై చర్చించాల్సి అంశాలను ఆమోదించనుంది. ఈ సమావేశానికి సీఎం జగన్‌, మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు పాల్గొనే అవకాశముంది. 
 
ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలో.. సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు.. చర్చించే అంశాలపై తీర్మానం చేయనున్నారు. కాగా, సాంకేతికంగా ఈ నెల 18లోగా శాసనసభను నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమైన బిల్లులు ఆమోదించుకోవాల్సి ఉన్నందున గురువారం ఒక రోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే నెల లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక మరోదఫా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments