Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కా చెల్లెళ్లకు స్మార్ట్ ఫోన్లు : చంద్రన్న ఎన్నికల తాయిలం.. జర్నలిస్టులకు కూడా...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:35 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రజలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా గ్రూపులోని ప్రతి మహిళకు రూ.10 వేల చొప్పున ఉచితంగా ఇచ్చారు. అలాగే, వృద్ధాప్య, వితంతు, వికలాంగు పింఛన్లను రెట్టింపు చేశారు. తాజాగా డ్వాక్రా గ్రూపులకు ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయించారు. 
 
ఈ నిర్ణయానికి ఏపీ మంత్రివర్గం బుధవారం ఆమోదముద్రవేసింది. అలాగే, పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుతోపాటు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. 
 
అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. అదేవిధంగా రైతు రుణమాఫీ చెక్కులను త్వరితగతిన చెల్లించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments