Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సర్కారు శుభవార్త చెప్పింది. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణం పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపారు. ఇందులోభాగంగా, ఈ నెలాఖరులోగా ఈ పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
ఇందుకోసం ప్రభుత్వం రూ.3 వేల కోట్ల మేరకు నిధులను మంజూరు చేయనుంది. అలాగే, ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులకు కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేయనుందని సమాచారం. ఇదిలావుంటే జగన్ సర్కార్ రైతులకు కూడా తాజాగా శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌లో పండించిన పప్పు, ధాన్యాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించడం విశేషం.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments