Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ.. కళాశాలల్లో అడ్మిషన్లను..?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:53 IST)
ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ వేసింది. ఎయిడెడ్ కళాశాలల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
 
ఎయిడెడ్ కళాశాలలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై హైకోర్టులో పిటీషన్  దాఖలు కాగా దీనిపై నేడు తీర్పు వెల్లడించింది. పిటీషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలను వినిపించారు.
 
ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. 
 
అయితే ఇక్కడ నర్రా శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారని చదివి వినిపించారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్దులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు న్యాయవాది.
 
అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్ పై విచారణ చేపడతామని ఈ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments