Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ.. కళాశాలల్లో అడ్మిషన్లను..?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:53 IST)
ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ వేసింది. ఎయిడెడ్ కళాశాలల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
 
ఎయిడెడ్ కళాశాలలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై హైకోర్టులో పిటీషన్  దాఖలు కాగా దీనిపై నేడు తీర్పు వెల్లడించింది. పిటీషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలను వినిపించారు.
 
ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. 
 
అయితే ఇక్కడ నర్రా శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారని చదివి వినిపించారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్దులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు న్యాయవాది.
 
అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్ పై విచారణ చేపడతామని ఈ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments