Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారిలోనే ప్రాణాలు విడిచిన భార్య.. తల్లడిల్లిపోయిన భర్త.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (09:33 IST)
అనారోగ్యం బారిన పడిన తన భార్యకు మెరుగైన వైద్యం చేయించేందుకు భర్త ఆస్పత్రికి బయలుదేరాడు. కానీ, కట్టుకున్న భార్య కళ్లముందే... మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. భార్య చనిపోతుండటాన్ని చూసిన భర్త చేసిన రోదనలు మిన్నంటాయి. అక్కడి ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఏపీలోని అమడగూరు మండలంలోని మామిడిమేకలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప తన భార్య చౌడమ్మ (35) అనారోగ్యంతో బాధపడుతుండటతో ఆమెను వైద్య పరీక్షల కోసమని అనంతపురానికి తీసుకెళ్లేందుకు స్వగ్రామం నుంచి ఆటోలో ఓబుళదేవరచెరువుకు చేరుకున్నారు. 
 
ఓబుళదేవర చెరువు బస్టాండ్‌కు రాగానే ఆమె పరిస్థితి విషమంగా మారింది. బస్సు కోసం వేచి చూసేలోగా ఆమె మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని హత్తుకుని అతను బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కనీసం మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ప్రజలే చందాలు వసూలు చేసి శవాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామనికి చేర్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ దృశ్యం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments