Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన పెద్దపప్పూరు పోలీసులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:37 IST)
వ‌ర‌ద బీభ‌త్సంలో ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తుపాను ఎంతో మందిని పొట్ట‌ను ప‌ట్టుకోగా, చాలా మందిని అధికార యంత్రాంగం కాపాడుతోంది. అనంత‌పురం జిల్లాలో వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడారు.
 
 
పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తుండంతో, పోలీసులు గుర్తించి ఆ రహదారి గుండా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. అవేమీ పట్టించుకోకుండా 20 మంది కూలీలతో ఐచర్ వాహనం వాగు దాటేందుకు ప్రయత్నించింది. వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐచర్ వాహనం  చిక్కుకుంది. కూలీలు  హహాకారాలు చేయడంతో గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు విషయం తెలియజేశారు. 
 
 
వెంటనే స్పందించిన ఎస్సై మహమ్మద్ గౌస్ హిటాచిని తీసుకుని తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాహనం మీద కూర్చుని వాగు లోకి వెళ్లి.ఒక్కొక్క మహిళను హిటాచిలోకి జాగ్రత్తగా లాక్కుని, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దపప్పూరు పోలీసుల సహాయక చర్యలను గ్రామ‌స్తులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments