Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి వివాదంపై హైకోర్టు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరోమారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో హైకోర్టు మండిపడింది. 
 
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉండగా, వీటిలో 14 అధికార వైకాపా, 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, 16 మంది కోరం ఉంటేనే ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కౌన్సిల్ కార్యావద్దే తిష్టవేశారు. అలాగే, వైకాపా, టీడీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో కార్యాలయం వద్ద చేరుకున్నాయి. మరోవైపు, ఎంపీ కేశినేని ఓటు చెల్లదంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఫలితంగా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయగా, ఈ రోజు కూడా కౌన్సిల్ కార్యాలయం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. దీంతో ఛైర్మన్ ఎన్నికను ఆర్వో నిరవధికంగా వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ పోలీస్ సమిషనర్, కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌లు కోర్టుకు రావాలంటూ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments