Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి వివాదంపై హైకోర్టు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరోమారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో హైకోర్టు మండిపడింది. 
 
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉండగా, వీటిలో 14 అధికార వైకాపా, 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, 16 మంది కోరం ఉంటేనే ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కౌన్సిల్ కార్యావద్దే తిష్టవేశారు. అలాగే, వైకాపా, టీడీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో కార్యాలయం వద్ద చేరుకున్నాయి. మరోవైపు, ఎంపీ కేశినేని ఓటు చెల్లదంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఫలితంగా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయగా, ఈ రోజు కూడా కౌన్సిల్ కార్యాలయం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. దీంతో ఛైర్మన్ ఎన్నికను ఆర్వో నిరవధికంగా వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ పోలీస్ సమిషనర్, కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌లు కోర్టుకు రావాలంటూ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments