Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి వివాదంపై హైకోర్టు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరోమారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో హైకోర్టు మండిపడింది. 
 
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉండగా, వీటిలో 14 అధికార వైకాపా, 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, 16 మంది కోరం ఉంటేనే ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కౌన్సిల్ కార్యావద్దే తిష్టవేశారు. అలాగే, వైకాపా, టీడీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో కార్యాలయం వద్ద చేరుకున్నాయి. మరోవైపు, ఎంపీ కేశినేని ఓటు చెల్లదంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఫలితంగా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయగా, ఈ రోజు కూడా కౌన్సిల్ కార్యాలయం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. దీంతో ఛైర్మన్ ఎన్నికను ఆర్వో నిరవధికంగా వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ పోలీస్ సమిషనర్, కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌లు కోర్టుకు రావాలంటూ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments