Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షకు రూ.30 వేల వడ్డీ పేరుతో మోసం.. అనంతపూరంలో ఘరానా మోసం..

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:40 IST)
రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేలు వడ్డీ చెల్లిస్తామని ఆశజూపారు. కొందరికి మాత్రం అలా చెల్లించారు. అది చూసి అత్యాశకు పోయిన పలువురు రూ.లక్షలు, కోట్లలో సమర్పించుకున్నారు. కొందరు అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టారు. ఇలా సుమారు రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు స్వీకరించిన సదరు వ్యక్తులు ఉడాయించారు. 
 
ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. 100 మందికి పైగా బాధితులు ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. 50 మంది బాధితులతో ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఓ కానిస్టేబుల్‌, జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సై కూడా ఏజెంటు తరహాలో నగదు కట్టించినట్లు సమాచారం. 
 
బాధితుల వివరాల ప్రకారం.. ఈబీఐడీడీ ఫైనాన్స్‌ సర్వీసు పేరుతో లావాదేవీలు సాగించారు. చెల్లించిన సొమ్ముకు కొందరికే రశీదులు ఇచ్చారు. ఈ సంస్థ మేనేజర్‌గా కడియాల సునీల్‌ వ్యవహరించారు. ఆయన సహాయకులుగా మహేంద్రచౌదరి, సుధాకర్‌, మాధవి వ్యవహరించారు. వీరి కింద 100 మంది ఏజెంట్లు పని చేస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు. 
 
పెద్ద మొత్తాలు చెల్లించిన తర్వాత  ఏజెంట్ల మొబైల్‌ పని చేయలేదు. రెండు, మూడు నెలలుగా వడ్డీలు చెల్లించలేదు. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంతపురానికి చెందిన బాబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments