Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయ స్వామి సాక్షిగా అమ్మాయిపై బ్లేడుతో దాడి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో ఓ ఉన్మాది ఒక యువతిని బ్లేడుతో గొంతు కోశారు. ఈ ఘటన స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వి.మాడుగుల గ్రామానికి చెందిన నగేశ్ అనే ఉన్మాది ఓ యువతి వెంటబడి ప్రేమిస్తున్నాంటూ వేధించసాగాడు. అయితే, ఆ యువతి నగేశ్ ప్రేమను తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నగేశ్ ఆ యువతి తనకు దక్కకుంటే మరెవ్వరికీ దక్కకూడదన్న ప్రతీకారంతో రగిలిపోయాడు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికంగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన ఆ యువతిని అనుసరించిన ఉన్మాది నగేశ్... అప్పటికే పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ యువతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు బాధిత యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
గతంలో కూడా ఈ యువతిపై నగేశ్ ఇదే విధంగా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే, అపుడు పోలీసులు నగేశ్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. ఇపుడు ఏకంగా ఆ యువతిపై బ్లేడుతో దాడిచేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments