Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడి డబ్బులు స్వాహా చేసిన వాలంటీర్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (19:10 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సచివాలయం పరిధిలో ఓ వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వాహా చేశాడు. మహిళను బురిడీ కొట్టించి ఈ నిధులను తన జేబులో వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీలోని వాలంటీర్లు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ గ్రామంలో పని చేసే ఖాసీం పీరా అనే వాలంటీర్ అమ్మ ఒడి నిధులతో పత్తా లేకుండా వెళ్లిపోయాడు. బాధిత మహిళ వెల్లడించిన వివరాల మేరరకు.. 
 
నాగినేని గుంట గ్రామానికి చెందిన హుసేన్ బీ వద్ద వేలిముద్ర వేయించుకున్న వాలంటీర్ అమ్మ ఒడి నగదును తీసుకుని పారిపోయాడు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ.10 వేలు గత నెల 7వ తేదీన డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు ఆమెకు చెప్పడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఆమె వాలంటీర్‌ను ప్రశ్నించగా ఒకదానికొకటి పొంతనలేని సమాధానం ఇచ్చాడు. పైగా ఇదిగో ఇస్తాను.. అదిగో ఇస్తాను అంటూ మభ్యపెట్టసాగాడు. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments