Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడి డబ్బులు స్వాహా చేసిన వాలంటీర్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (19:10 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సచివాలయం పరిధిలో ఓ వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వాహా చేశాడు. మహిళను బురిడీ కొట్టించి ఈ నిధులను తన జేబులో వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీలోని వాలంటీర్లు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ గ్రామంలో పని చేసే ఖాసీం పీరా అనే వాలంటీర్ అమ్మ ఒడి నిధులతో పత్తా లేకుండా వెళ్లిపోయాడు. బాధిత మహిళ వెల్లడించిన వివరాల మేరరకు.. 
 
నాగినేని గుంట గ్రామానికి చెందిన హుసేన్ బీ వద్ద వేలిముద్ర వేయించుకున్న వాలంటీర్ అమ్మ ఒడి నగదును తీసుకుని పారిపోయాడు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ.10 వేలు గత నెల 7వ తేదీన డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు ఆమెకు చెప్పడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఆమె వాలంటీర్‌ను ప్రశ్నించగా ఒకదానికొకటి పొంతనలేని సమాధానం ఇచ్చాడు. పైగా ఇదిగో ఇస్తాను.. అదిగో ఇస్తాను అంటూ మభ్యపెట్టసాగాడు. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments