Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కదులుతున్న రైలు నుంచి పడిన ప్రేమికులు.. మాట్లాడుతూ..?

Train
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:41 IST)
Train
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన కారుణ్య అనే 24 ఏళ్ల మహిళ కదులుతున్న రైలు నుంచి పడి తీవ్ర గాయాలపాలైన ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. 
 
చెంగల్‌పట్టులో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న కారుణ్య తన స్నేహితులతో కలిసి కేరళకు వెళ్తోంది. తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి ముందు కారుణ్య తన ప్రియుడు రాజేష్‌తో మాట్లాడుతూవుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. 
 
రైలు కదలడం ప్రారంభించగానే, ఇద్దరూ దానిని ఎక్కేందుకు పరుగెత్తారు, కానీ కారుణ్య కాలుజారిపోయింది. మెట్లపై నుంచి దొర్లిపోయింది. కదులుతున్న రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాజేష్ కూడా రైలు నుంచి కింద పడ్డాడు.
 
తోటి ప్రయాణీకులు వారిని కాపాడారు. రాజేష్‌, కారుణ్యను పట్టాల కిందకు వెళ్లకుండా కాపాడారు.  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు భారతీయుల మృతి