Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓపీఎస్ కుమారుడిపై మహిళ ఫిర్యాదు.. ఫోనులో అలా మాట్లాడుతున్నారు..

OPS son
, బుధవారం, 2 ఆగస్టు 2023 (21:56 IST)
OPS son
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ రంగానికి చెందిన మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పట్లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం కుమారుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌పై ఓ మహిళ లైంగిక ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. 
 
గాయత్రీ దేవి అనే మహిళ, పార్లమెంటు సభ్యురాలు, ఈమె తమిళనాడు డీజీపీ కార్యాలయంలో రవీంద్రనాథ్‌పై ఫిర్యాదు చేశారు. తాను తోబుట్టువుగా భావించే ఓపీ రవీంద్రనాథ్ తప్పుడు ఉద్దేశంతో తనను సంప్రదించారని తెలిపారు. 
 
అందుకు ఆమె నిరాకరించడంతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, స్నేహితుల నుంచి నిత్యం బెదిరింపులకు గురవుతున్నానని చెప్పారు. తనకు భద్రత కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం తాపించి.. అమెరికా మహిళపై అత్యాచారం... ఎక్కడ?