Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలయంలో 108 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహం నిర్మాణం

Webdunia
సోమవారం, 24 జులై 2023 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంత్రాలయంలో 108 అడుగులు భారీ ఎత్తున శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
 
కాగా, ఈ భారీ శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయం శివారు ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త, ప్రముఖ శిల్పి రామ్ వాంజీ సుతార్ మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. కాగా, ఈ విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. ఈ రాముడి విగ్రహం దేశంలోనే అతి ఎత్తైన విగ్రహం కానుంది.
 
కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి.. 
 
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇంటి నిర్మాణానికి స్థానిక టీడీపీ నేతలు భూమిపూజ చేశారు. గత కొంతకాలంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో సొంతిల్లు లేదంటూ వైకాపా నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరి నోటికి తాళం వేసేందుకు ఆయన సొంతిల్లును నిర్మించాలన్ని నిర్ణయించి, ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఇంతకాలం తొక్కిపెట్టి, తాజాగా అనుమతి ఇచ్చారు. 
 
దీంతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో 99.77 సెంట్ల భూమిని గతంలో చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారు. ఇది జాతీయ రహదారిని ఆనుకునివుంది. ఇందులో గృహ నిర్మాణం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్నెల్ల క్రితం ఆయన దరఖాస్తు చేసుకోగా, ఇన్నాళ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణంతో సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదన్న విమర్శలకు ఇక చెక్ పెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments