Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్... ఢిల్లీకి రమంటూ ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారు. దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారు.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (08:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారు. దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారు. అవసరమైతే ముగ్గురు సభ్యుల బృందాన్ని హస్తినకు పంపిస్తామని చెప్పారు. దీంతో షా ఫోన్ పెట్టేసినట్టు సమాచారం. 
 
సోమవారం నుంచి బడ్జెట్ మలిదశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన పక్షంలో రాజీనామాలకు సిద్ధమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ కూడా దూరమవుతుందన్న బీజేపీ భావిస్తోంది. 
 
ఈనేపథ్యంలో చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి, చర్చిద్దాం రమ్మని ఆహ్వానం పలికారు. ఐదో తేదీన ఢిల్లీకి వస్తే కలిసి మాట్లాడుకుందామని సూచించారు. చర్చలకు సమ్మతించిన చంద్రబాబునాయుడు తాను రానని స్పష్టంగా తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులను పంపిస్తానని, వారితో మాట్లాడాలని ఆయన తెలిపారు. దీంతో షా ఖంగుతిని ఫోన్ పెట్టేశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments