Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు.. రాష్ట్రంలో తుస్సే : బీజేపీపై అంబటి విసుర్లు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:28 IST)
భారతీయ జనతా పార్టీపై వైకాపా నేత, మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు కానీ రాష్ట్రంలో మాత్రం తుస్సేనని చెప్పారు. ఆత్మకూరు అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో లేదని అందుకే బీజేపీ నేతలు రోడ్లపై కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు మాట్లాడుతూ, బీజేపీ నేతలు ప్రచారం కోసమే తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పైగా, టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 
 
ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వైకాపా కార్యకర్తలు రప్పించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments