Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం ఇంటిపై దాడికి తెగబడిన వైకాపా కార్యకర్తలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:27 IST)
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై అధికార వైకాపాకు చెందిన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. 
 
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పలని గొడవకు దిగారు. లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పెద్దపెద్ద రాళ్లు, కట్టెలతో దాడులకు పూనుకున్నారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే జోగి రమేష్ సమక్షంలో ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర చూస్తూ మిన్నకుండిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
మరోవైపు, చంద్రబాబు ఇంటిపై దాడి జరుగుతుందని తెలుసుకున్న అమరావతి పోరాట సమితి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. జెడ్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబుపైనే దాడికి దిగుతుంటే.. ఇక సామాన్యల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ దాడిని పోలీసులే ప్రోత్సహించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ దగ్గరుండి మరీ వైసీపీ నేతలను బాబు ఇంటి వద్దకు పంపారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments