Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అపార్టుమెంట్లలో పనులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (10:32 IST)
నవ్యాంధ్య రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్లుమెంట్లలో మిగిలి పోయిన పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. పాలనా వికేంద్రీకరణ పేరుతో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కారు ఇటీవల వెనక్కి తీసుకుంది. దీంతో ఇపుడు అమరావతిపై దృష్టిసారించింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టుంది. 
 
నిజానికి రాజధాని నిర్మాణం పనులు నిలిపివేసిన సమయానికే ఈ భవాలన నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. కొన్ని భవనాల్లో మాత్రం కాంక్రీట్, టైల్స్, రంగులు వేయడం, ఏసీలు అమర్చడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటివి మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఇపుడు అలా మిగిలిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు. 
 
ఇదిలావుంటే అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోసం 12 టవర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం 6 టవర్లలో అపార్టుమెంట్లను నిర్మించారు. ఈ మొత్తం పనులకు ఒకే ప్యాకేజీగా అప్పట్లో టెండర్లను కూడా ఆహ్వానించగా, ఎన్.సి.సి సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments