Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో నిర్మించిన భవంతులను ఏం చేద్ధాం? ప్రత్యేక కమిటీ ఏర్పాటు!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:06 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించిన బహుళ అంతస్తులపై ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 
 
మొత్తం తొమ్మిది మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శాసన రాజధానిగా అమరావతికి అవసరమయ్యే భవనాలు, నివాస సముదాయాలను గుర్తించడంతో పాటు ఇప్పటికే పనులు ప్రారంభమై, అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ నివాస సముదాయాలను ఏం చేయాలో సూచించనుంది. 
 
సీఎస్‌ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం ముఖ్య సలహాదారు, సభ్యులుగా సాధారణ పరిపాలన, పురపాలక, ఆర్థిక, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపీఎల్‌ఏ కార్యదర్శి, ఏఎంఆర్డీయే మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ నియమితులయ్యారు. 
 
అమరావతిలో వివిధ దశల్లో నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్‌మెంట్లు, బంగ్లాలు, ఇతర భవంతులను తొలుత నిర్ణయించిన విధంగా పూర్తి చేయాలా లేక వాటిని కుదించి, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు అవకాశాలున్నాయా అనే అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments