Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో నిర్మించిన భవంతులను ఏం చేద్ధాం? ప్రత్యేక కమిటీ ఏర్పాటు!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:06 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించిన బహుళ అంతస్తులపై ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 
 
మొత్తం తొమ్మిది మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శాసన రాజధానిగా అమరావతికి అవసరమయ్యే భవనాలు, నివాస సముదాయాలను గుర్తించడంతో పాటు ఇప్పటికే పనులు ప్రారంభమై, అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ నివాస సముదాయాలను ఏం చేయాలో సూచించనుంది. 
 
సీఎస్‌ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం ముఖ్య సలహాదారు, సభ్యులుగా సాధారణ పరిపాలన, పురపాలక, ఆర్థిక, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపీఎల్‌ఏ కార్యదర్శి, ఏఎంఆర్డీయే మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ నియమితులయ్యారు. 
 
అమరావతిలో వివిధ దశల్లో నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్‌మెంట్లు, బంగ్లాలు, ఇతర భవంతులను తొలుత నిర్ణయించిన విధంగా పూర్తి చేయాలా లేక వాటిని కుదించి, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు అవకాశాలున్నాయా అనే అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments