Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌ ప్లాంట్ కోసం "ఉక్కు" సంకల్పంతో పోరాటం చేస్తాం : అచ్చెన్నాయుడు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (13:42 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, ఇందుకోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అచ్చెన్నాయుడు మద్దతు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ విశాఖకు అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నోరు తెరవడంలేదని మండిపడ్డారు. జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని.. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
మరో టీడీపీ నేత కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోసి.. సీఎం జగన్‌, వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటీకరణకు ముందే అంగీకరించి.. ఏం తెలియనట్లు ప్రధానికి లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా చేశారని... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments