చంద్రబాబుకు హ్యాండిచ్చిన తెదేపా ఎమ్మెల్సీలు.. పొంచివున్న అనర్హత గండం?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (07:41 IST)
తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు తేరుకోలేని షాకిచ్చారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టినపుడు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ ఇద్దరిపై అనర్హత వేటుపడనుంది. 
 
మూడు రాజధానుల బిల్లులు శాసనమండలిలో మంగళవారం సీఎం జగన్ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీడీపీ విప్ జారీ చేసింది. అయితే, ఈ విప్‌ను ధిక్కరించిన వీరిద్దరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, కడప జిల్లాకు చెందిన శివనాథ రెడ్డిలు ఉన్నారు. 
 
శివనాథ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు కావడం గమనార్హం. మరోవైపు, పోతుల సునీత కూడా మంగళవారం మధ్యాహ్నమే పార్టీ మారబోతున్నట్టు సంకేతాలు పంపించింది. స్థానికంగా తమకు అనేక ఇబ్బందులు ఉన్నాయనీ, వీటిని అధికమించాలంటే తాము పార్టీ మారక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఇద్దరు సభ్యులకు అనర్హత వేటు గండం పొంచి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్.. అరుంధతిగా కనిపించబోతుందా?

Chiru: సర్దార్ పటేల్ ని స్పూర్తిగా తీసుకోవాలి - వాటిపై అసెంబ్లీలో చట్టాలు చేయాలి : చిరంజీవి

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments