Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ తొలి హామీ ఇంకా అమలు కాలేదు.. రాజధానిపై నిరసన సెగలు

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (10:48 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అధికారం చేపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఏడాది మే 30న విజయవాడలో జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణస్వీకారోత్సవం తర్వాత చేసిన తొలి సంతకమే ఇంతవరకు అమలు కాలేదు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 
 
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ఫైల్ మీద సంతకం కూడా చేశారు. అయితే, ఇంత వరకు ఆ విషయంలో అడుగు మాత్రం ముందుకు పడలేదు. గతంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నుంచి నేటి వరకు మధ్యలో 60 సంవత్సరాలు దాటిన ఎవరికీ పెన్షన్లు రావడం లేదు.
 
మరోవైపు మూడు రాజధానుల ప్రకటన ఏపీలో సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. నేటితో రైతుల దీక్షలు, ఆందోళనలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. 
 
వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అమరావతి రైతులకు మహిళలు,యువత పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగానికి ఫలితం ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments