మీది ఏ ఊరు.. గుర్తింపు కార్డు లేదా? ఊర్లోకి అనుమతిలేదు : పోలీసులు

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (12:29 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం తమ పంటభూములిచ్చిన అమరాతి ప్రాంత రైతులను పోలీసులు ఏపీ పోలీసులు ఓ ఆట ఆడుకుంటున్నారు. రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 250 రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆదివారం రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేయనున్నారు. 
 
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోను నిరసనలు హోరెత్తుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళల నిరసనలు సాగుతున్నాయి. 
 
మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
మరోవైపు, రాజధాని ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉంటేనే గ్రామాల్లోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇస్తున్నారు. గుర్తింపు కార్డు లేనివారిని లోపలకు అనుమతించడంలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

రిషికేష్‌కు రజినీకాంత్, రోడ్డు పక్కన రాతి బెంచీపై ప్లేటులో భోజనం చేస్తూ...

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments