ముఖ్యమంత్రి జగన్‌కి అమరావతి రైతుల ఫోబియా

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (17:36 IST)
అమరావతి మహిళా జేఏసీ నేత, ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌కి అమరావతి రైతుల ఫోబియా పట్టుకుందన్నారు.
 
అమరావతి పేరు విన్నా, రైతుల ఉద్యమం గురించి విన్నా ముఖ్యమంత్రి భయపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని  బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే బటన్ సీఎం అమరావతి రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు.
 
కరోనా సమయంలో ఉపాధి లేక రైతులు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బటన్ సీఎం జగన్  అమరావతి రైతులకు కూడా బటన్ నొక్కి వారికి వార్షిక కౌలు చెల్లించాలి.
 
రైతు కూలీలకు ఇస్తున్న జీవన భృతి పెంపు హామీ ఏమైంది? అమరావతి రైతులు ఆంద్రప్రదేశ్ ప్రజలు కాదా ? ఎందుకు వారిని వేరుగా చూస్తున్నారు. బటన్ సీఎం తక్షణమే రైతులకు వార్షిక కౌలు, రైతు కూలీలకు జీవన భృతి చెల్లించాలి అంటూ వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments