Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రైతుకు 50 మంది పోలీసుల రక్షణ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:33 IST)
మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని విధ్వంసం చేసిన వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంత రైతులు అంటే హడలిపోతున్నారు. దీంతో తాను ప్రయాణించే మార్గంలో వందల, వేల సంఖ్యలో పోలీసులను రోడ్డుకు ఇరువైపులా మొహరించి, ఆ తర్వాత తన కాన్వాయ్ సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రోడ్డు పక్కన ఊత కర్రతో నిలబడివున్న ఓ రైతుకు కాపలాగా 50 మంది పోలీసులు ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
ఆ వృద్ధుడు సరిగ్గా నడవలేడు. చేతికర్ర లేనిదే అడుగు తీసివేయలేడు. అలాంటి రైతును చూసినా సీఎం జగన్‌కు హడల్. ఆ రైతు చుట్టూ 50 మంది పోలీసులు నిల్చొన్నారు. దీనికి కారణం.. ఆయన అమరావతి రైతు. ఆయన నిలబడిన చోటు దీక్షాశిబిరం. 50 మందికిపైగా పోలీసులు ఆ రైతు ముందు గోడలా నిలబడితే.. వెనుక నుంచి కార్ల కాన్వాయ్‌లో సీఎం జగన్ వెళ్లారు. 
 
రాజధానిని మూడు ముక్కలాట చేసి అమరావతికి కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడలేక, వారి సమస్య పరిష్కరించలేక రాజకీయ క్రీడ ఆడుతున్న సీఎం ఇలా పోలీసుల మాటున దాటిపోతున్నారు. ఈ పరిస్థితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరం వద్ద కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments