Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుంగనూరు అల్లర్లు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదనీ...

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:09 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. వీరిలో కొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరికొందరికి ఇంకా బెయిల్ రాలేదు. దీంతో తన కుమారుడికి బెయిల్ రాలేదన్న మనస్తాపంతో ఓ నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో సోమవారం జరిగింది. గ్రామ సర్పంచి శ్రీనివాసులు నాయుడు అల్లర్ల కేసులో అరెస్టయి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీకా ఉన్నారు. ఈ కేసులోని నిందితుల్లో 50 మందికి బెయిల్ వచ్చింది. కానీ, శ్రీనివాసులు నాయుడికి మాత్రం బెయిల్ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికు గురైన అతని తల్లి రాజమ్మ తెలియని ద్రావకం ఏదో తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments