Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా వైకాపాలోకి టీడీపీ అమలాపురం ఎంపీ

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:55 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన వైకాపా, టీడీపీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ విపక్ష వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ఎంపీ కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరు రవీంధ్ర బాబు. అమలాపురం ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
నిజానికి కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపించారు. కానీ, ఇపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరే వారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో రాష్ట్రంలో వలస రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. 
 
తాజాగా, అమలాపురం లోక్‌సభ సభ్యుడు పండుల రవీంధ్రబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను పార్టీ మారడం లేదని ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ, కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. సో.. ఆయన కూడా ఏక్షణమైనా వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

తర్వాతి కథనం
Show comments