Webdunia - Bharat's app for daily news and videos

Install App

17ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులు.. తర్వాత..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (18:22 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బాలికపై లైంగిక దాడితో పాటు.. బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమలాపురంకు చెందిన 17ఏళ్ల బాలిక పోటీ పరీక్షల శిక్షణ కోసం రాజమహేంద్ర వరం వెళ్లింది. అక్కడ ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మణి వెంకట సత్యనారాయణతో పరిచయమైంది. అలా ఓ రోజు బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. 
 
తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై నగ్నచిత్రాలు తీసి బెదిరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వేధిస్తూ వచ్చాడు. అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులకు బాధితురాలు ఈ విషయం తెలిపింది. 
 
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన 15మంది స్నేహితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. వీరిలో విద్యార్థినులు కూడా వున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం