Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం అల్లర్లు : కీలక నిందితుడు అన్యం సాయి అరెస్టు

Webdunia
బుధవారం, 25 మే 2022 (19:20 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాత్మక ఘటనలో కీలక నిందితుడుగా భావిస్తున్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. 
 
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు, అంబేద్కర్ పేరు కొనసాగించాలని మరికొందరు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి అల్లర్లకు దారితీశాయి. రాష్ట్ర మంత్రి విశ్వరూపం, ఎమ్మెల్యే సతీష్ గృహాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 
 
ఈ అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీరిలో అన్యం సాయి ప్రధాన నిందితుడుగా భావిస్తున్నారు. ఈయన అధికార వైకాపాకు చెందిన నేతలగా భావిస్తున్నారు. 
 
జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేతబట్టిన సాయి వీడియోలు ప్రస్తుతం న్యూస్ చానెళ్ళలో వైరల్‌గా మారాయి. ఆరంభం నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ సాగుతున్న ఆందోళనలో సాయి కీలకంగా వ్యవహిరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments