Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని రాజకీయ పక్షాలు కలసికట్టుగా పోరాడాలి: పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (18:04 IST)
ఆంధ్రప్రదేశ్ లోని భవన నిర్మాణ కార్మికుల కోరిక మేరకు ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్న జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్ని పార్టీల అగ్ర నాయకులతో ఈ రోజు ఫోన్ లో మాట్లాడారు. 

 
తెలుగుదేశం అధ్యక్షుడు  నారా చంద్ర బాబు నాయుడుతో ఈ విషయమై మాట్లాడారు. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని  కోరారు.

నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం కుడా సంఘీభావం ప్రకటించాలని  చంద్ర బాబును కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా మాట్లాడారు. తొలుత ఇదే సమస్య పై బి.జె.పి., ఏ.పి. అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ లోని  సి.పి.ఎం. కార్యదర్శి మధు, సి.పి.ఐ.కార్యదర్శి  రామకృష్ణ, లోక్ సత్తా అధ్యక్షులు డి.వి.వి.ఎస్.వర్మ, బి.ఎస్.పి. అధ్యక్షులు సంపత్ రావుతో కూడా  పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు.

లాంగ్ మార్చ్ లో తమ తమ కార్యకర్తలతో కలసి పాల్గొనవలసిందిగా కోరారు. విషయాన్ని తమ తమ పార్టీ లో చర్చిస్తామని వారు చెప్పారు. లాంగ్ మార్చ్ కు ఆహ్వానించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments