Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇఆర్‌సి చైర్మన్ గా జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ మేరకు జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం నూతన ఇఆర్‌సి చైర్మన్‌ జస్టీస్‌ సీవీ నాగార్జున రెడ్డికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలు పుష్ఫగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనీల్‌ కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండి నాగుపల్లి శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments