Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రిగోల్డ్ కేసులో కీలక అరెస్ట్

అగ్రిగోల్డ్ సంస్థ కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ మోసం వెలుగుచూసినప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన వైస్ ఛైర్మన్ సీతారామారావును ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ చైర్మన్ వెంటకరామారావుకు ఈయన సోదరుడు. కేసు నమోదయిన

Webdunia
మంగళవారం, 22 మే 2018 (20:34 IST)
అగ్రిగోల్డ్ సంస్థ కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ మోసం వెలుగుచూసినప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన వైస్ ఛైర్మన్ సీతారామారావును ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్  చైర్మన్ వెంటకరామారావుకు ఈయన సోదరుడు. కేసు నమోదయిన వెంటనే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు సీతారామారావు. హైకోర్ట్ బెయిల్ నిరాకరించడంతో సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లారు. 
 
అప్పటి నుండి ఆయనను పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక పోలీసులు బృందాలను రంగంలోకి దింపారు. ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని పక్కా సమాచారంతో ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు ఢిల్లీలో సీతారామారావును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న సీతారామారావును మరో రెండు రోజుల్లో విజయవాడకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
సీతారామారావును అరెస్టు చేయడంతో అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎస్ఎల్ గ్రూప్ కొనుగోలు చేయకుండా  సీతారామారావు అడ్డుకుంటున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ కీలకం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments