Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యే అంటూ యువతితో దిగాడు... 4 రోజులు ఎంజాయ్... శవమై తేలాడు...

తిరుపతి ఆధ్మాత్మిక క్షేత్రం మరోసారి ఉలిక్కిపడింది. ప్రైవేటు హోటల్లో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఒక యువకుడు విగతజీవిగా మారిపోయాడు. యువకుడి హత్యకు అతనితో పాటు వచ్చిన మహిళ కారణమా

Webdunia
మంగళవారం, 8 మే 2018 (18:18 IST)
తిరుపతి ఆధ్మాత్మిక క్షేత్రం మరోసారి ఉలిక్కిపడింది. ప్రైవేటు హోటల్లో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఒక యువకుడు విగతజీవిగా మారిపోయాడు. యువకుడి హత్యకు అతనితో పాటు వచ్చిన మహిళ కారణమా లేకుంటే వేరే కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో యువకుడి హత్య పోలీసులకు సవాల్‌గా మారింది.
 
తిరుపతి నగరంలో ఏ సంఘటన జరిగినా ఒక సంచలనమే. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వచ్చి వెళ్ళే ప్రాంతంలో భద్రత అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఈమధ్యకాలంలో నగరంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఒక లాడ్జీలో యువకుడి హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన 35 యేళ్ళ మోహన్ మరో మహిళతో కలిసి ఈ నెల 4వ తేదీన తిరుపతికి వచ్చాడు. తనతో పాటు ఉన్న మహిళ భార్యగా హోటల్ సిబ్బందికి చెప్పాడు. 
 
పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వచ్చామని, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నామని హోటల్ సిబ్బందికి చెప్పి గదిని అద్దెకు తీసుకున్నాడు. 5, 6వ తేదీ తాము నెల్లూరుకు వెళుతున్నామని చెప్పాడు. ఆ తరువాత 6వ తేదీ మధ్యాహ్నం గదికి వచ్చాడు. మళ్ళీ తిరుమలకు వెళుతున్నానని చెప్పాడు. 7వ తేదీ మధ్యాహ్నం గదికి వచ్చాడు. ఢిల్లీకి వెళ్ళిపోవాలని గదిని ఖాళీ చేసి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాడు. ట్రైన్ మిస్సయ్యిందని చెప్పి తిరిగి అదే హోటల్‌కు వచ్చి గదిని తీసుకున్నాడు. 
 
8వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీకి వెళతామని చెప్పాడు. అయితే ఉదయం 6గంటల సమయంలో మోహన్‌తో పాటు వచ్చిన మహిళ హడావిడిగా హోటల్ రిపెస్షన్ వద్దకు వెళ్ళి నేను బయటకు వెళుతున్నాను.. నాకు పని ఉంది. నా భర్త తరువాత వస్తాడని వెళ్లిపోయింది. గది నుంచి ఎలాంటి శబ్దం లేకపోవడంతో హోటల్ సిబ్బంది కిటికీ తెరిచి చూశారు. మోహన్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
మోహన్‌తో పాటు వచ్చిన మహిళ భార్యా లేకుంటే ఇంకెవరైనా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మోహన్ నెల్లూరుకు వెళ్లినప్పుడు మొబైల్‌లో తీసుకున్న ఫోటోలను కూడా గుర్తించారు పోలీసులు. ఆ ఫోటోలో మరో మహిళ, ఒక యువకుడు కూడా ఉన్నారు. ఒకవేళ వారేమైనా హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు అక్రమ సంబంధం హత్యకు కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి లోతుగా విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments