Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి చేరిన బెయిల్ కాపీ... సోమవారం రఘురామ డిశ్చార్జ్

Webdunia
ఆదివారం, 23 మే 2021 (11:50 IST)
వైకాపా రెబెల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామపై ఏపీ సీఐడి పోలీసులు ఈ రాజద్రోహం కేసును నమోదు చేసిన విషయం తెల్సిందే. 

రఘురామకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ విడుదల అయింది. ఈ కాపీని రఘురామ తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వర్గాలకు అందజేశారు. రఘురామ ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ క్రమంలో ఆయన ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది. బెయిల్ తీర్పు కాపీలో సుప్రీం పలు అంశాలను పేర్కొంది. తన బెయిల్ కోసం రఘురామ 10 రోజుల్లో సీఐడీ కోర్టులో రూ.1 లక్ష పూచీకత్తు చెల్లించి బెయిల్ పొందవచ్చని వివరించింది. 

అందుకోసం ఇద్దరు హామీదార్ల పేర్లను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ పత్రాలను సోమవారం ఆయన న్యాయవాదులు సీఐడీ కోర్టులో సమర్పించిన మీదట, సైనికాసుపత్రి నుంచి రఘురామ విడుదల కానున్నారు. కాగా, ఇటీవల ఏపీ సీఐడీ అరెస్టు చేసిన రఘురామను చిత్ర హింసలు పెట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments