Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతలు స్వీకరించిన అర గంటలోనే ఏఎస్పీ బదిలీ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 3 మే 2023 (08:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాము చెప్పిందే వేదమనే రీతిలో వారి ప్రవర్తన ఉంది. ముఖ్యంగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనే ఓ మంచి ఉదాహరణ. 
 
కర్నూలు జిల్లా ఆదోని ఏఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా నియమితులయ్యారు. దీంతో ఆయన మంగళవారం ఆదోనికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆ సంతోషం ఆయనకు ఎక్కువ సేపు నిలవలేదు. బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చొన్న అరగంట వ్యవధిలోనే ఆయన బదిలీ అయినట్టుగా సమాచారం అందాయి. ఆయన అక్కడ నుంచి తిన్నగా వెళ్లిపోయారు. 
 
కాగా, రాణాను రంపచోడవరం నుంచి ఆదోనికి బదిలీ చేశారు. ఆయన డీఎస్పీ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11.25 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అరగంటలోనే కర్నూలుకు రావాలని పై అధికారుల నుంచి ఏఎస్పీకి ఆదేశాలు అందాయి. దీంతో  ఆయన తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 
 
కాగా, స్ట్రిక్ట్ అధికారిగా పేరున్న రాణా.. ఆదోని బదిలీ అయ్యారన్న వార్త తెలుసుకున్న స్థానిక అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వారంతా ఇటీవల అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి తమ బాధను వెళ్లబోసుకోవడంతో ఆయన ఆగమేఘాలపై తాడేపల్లికి వెళ్లి రాణాను బదిలీ చేయించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments