Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో భారీ స్థాయిలో 56 ఐఏఎస్ అధికారులను బదిలీ

Advertiesment
New districts in Andhra Pradesh
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (11:54 IST)
ఏపీలో పెద్ద సంఖ్యలో 56 ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతుండగా, ఒకేసారి ఇంతమంది అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. 
 
షెడ్యూల్ ప్రకారం వచ్చే వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగాలి. 8 జిల్లాల కలెక్టర్లు సహా 56 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధ రాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు. 
 
విజయనగరం కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా, కర్నూలు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మిని విజయనగరం కలెక్టర్‌గా పంపారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న సృజనను కర్నూలు కలెక్టర్‌గా బదిలీ చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

400 ఏళ్ల చరిత్ర.. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు