Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లా మాడుగులలో మహిళపై యాసిడ్ దాడి

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగుడు యాసిడ్‌దా దాడి చేశారు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురజాల మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాడు. దాహంగా ఉందని కాస్త మంచినీళ్లు ఇవ్వాలంటూ ఆ ఇంట్లో ఉన్న మహిళను ప్రాధేయపడ్డాడు. 
 
దీంతో  ఆ మహిళ జాలిపడి ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి అతడికి ఇస్తుండగానే దుండగుడు తన వెంట తీసుకొచ్చిన యాసిడ్‌ను ఆమె శరీరంపై పోసి పారిపోయాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి వద్ద వివరాలు సేకరిస్తున్నారు. పారిపోయిన దండగుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments