Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:08 IST)
కర్మాగారములలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లును కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ... చరిత్రాత్మక బిల్లును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం వైయస్‌ జగన్‌ అందరికీ న్యాయం చేస్తున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే అని జయరాం తెలిపారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశారని, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్‌ అని అన్నారు. 
 
 ఈ సందర్భంగా బిల్లుపై కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గూడూరు ఎమ్మెల్యే ఆర్‌.వరప్రసాదరావు, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తదితరులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments