Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త బతికుండగానే 15 యేళ్ళుగా వితంతు పెన్షన్ తీసుకున్న భార్య, ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:17 IST)
వారికి పెళ్ళయి రెండు సంవత్సరాలైంది. ఇద్దరి మధ్యా పొసగలేదు. విడాకులకు ధరఖాస్తు చేసుకుని విడిపోయారు. ఇదంతా 15 యేళ్ళ క్రితం జరిగింది. ఇద్దరూ వేర్వేరు పెళ్ళిళ్లు చేసేసుకున్నారు. కానీ తన భర్త చనిపోయాడంటూ రెవిన్యూ అధికారులను మోసం చేసి వితంతు పెన్షన్ పొందుతోంది భార్య. 
 
శ్రీకాకుళం జిల్లా కోటప్ప మండలం కొత్తకోటకు చెందిన రూప, శ్రీనులకు 17 యేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరూ మొదట్లో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో శ్రీనుతో విభేధించింది రూప. ఇద్దరూ కలిసే విడాకులకు అప్లై చేసుకున్నారు. విడిపోయారు. ఆ తరువాత కొన్నినెలల గ్యాప్‌లో వారు వేరే వివాహం చేసేసుకున్నారు.
 
ఇదంతా బాగానే ఉన్నా రూప మాత్రం తన భర్త చనిపోయాడంటూ రెవిన్యూ కార్యాలయంలో ధరఖాస్తు  చేసుకుని ఫించన్ తీసుకోవడం ప్రారంభించింది. 2014 సంవత్సరంలో ఆన్ లైన్ చేశారు. అప్పుడు కూడా ధరఖాస్తు చేసుకుని వితంతు పెన్షన్ తీసుకోవడం కొనసాగిస్తోంది. ఇది కాస్త భర్తకు తెలిసింది.
 
నిన్న ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళి అధికారులో గొడవపెట్టుకున్నాడు శ్రీను. తాను బతికే ఉన్నానని.. అయితే తాను  చనిపోయానంటూ మొదటి భార్య ధరఖాస్తు చేస్తే ఎలా ఇన్ని సంవత్సరాలుగా వితంతు పెన్షన్ ఇస్తున్నారంటూ ప్రశ్నించాడు. రెవిన్యూ అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయాడు శ్రీను. దీనిపై ఎమ్మార్వో అధికారులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments