Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వార్డులో డాక్టర్ వేషంలో మోసాలకు పాల్పడుతున్న మాయలేడి

Webdunia
గురువారం, 30 జులై 2020 (15:16 IST)
కరోనావైరస్ రోగి దగ్గరికి వెళ్లాలంటే కుటుంబ సభ్యులు సైతం హడలిపోతున్న తరుణంలో ఓ మాయా లేడి ఏకంగా వైద్యురాలి వేషంలో కరోనా వార్డులో తిరుగుతూ మొబైల్ పోన్లు కొట్టేస్తూ రోగుల బంధువుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతుంది.
 
ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యుల సంఖ్య కూడా ఎక్కువే. పీపీఈ కిట్ ధరిస్తే ఎవరు వైద్యులో ఎవరు కాదో చెప్పడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకొని శైలజ(43) అనే మహిళ డాక్టర్ వేషం వేసి కరోనా వార్డులో చోరీలకు తెగపడింది.
 
కరోనా పేషెంట్ల ఫోన్లు కాజేయడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తామని చెబుతూ రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. తమ వాళ్ల పరిస్థితి ఏమని ఎవరైనా అడిగితే వారి పరిస్థితులను ఆసరాగా చేసుకొని వారి దగ్గరనుండి డబ్బుల వసూలు చేసేది. పీపీఈ కిట్‌తో నిత్యం కరోనా వార్డులో తిరుగుతున్న శైలజ గురించి సెక్యూరిటి సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు ప్రశ్నించగా పారిపోయింది.
 
మళ్లీ మరుసటి రోజు రావడంతో మహిళా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments