Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వార్డులో డాక్టర్ వేషంలో మోసాలకు పాల్పడుతున్న మాయలేడి

Webdunia
గురువారం, 30 జులై 2020 (15:16 IST)
కరోనావైరస్ రోగి దగ్గరికి వెళ్లాలంటే కుటుంబ సభ్యులు సైతం హడలిపోతున్న తరుణంలో ఓ మాయా లేడి ఏకంగా వైద్యురాలి వేషంలో కరోనా వార్డులో తిరుగుతూ మొబైల్ పోన్లు కొట్టేస్తూ రోగుల బంధువుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతుంది.
 
ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యుల సంఖ్య కూడా ఎక్కువే. పీపీఈ కిట్ ధరిస్తే ఎవరు వైద్యులో ఎవరు కాదో చెప్పడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకొని శైలజ(43) అనే మహిళ డాక్టర్ వేషం వేసి కరోనా వార్డులో చోరీలకు తెగపడింది.
 
కరోనా పేషెంట్ల ఫోన్లు కాజేయడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తామని చెబుతూ రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. తమ వాళ్ల పరిస్థితి ఏమని ఎవరైనా అడిగితే వారి పరిస్థితులను ఆసరాగా చేసుకొని వారి దగ్గరనుండి డబ్బుల వసూలు చేసేది. పీపీఈ కిట్‌తో నిత్యం కరోనా వార్డులో తిరుగుతున్న శైలజ గురించి సెక్యూరిటి సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు ప్రశ్నించగా పారిపోయింది.
 
మళ్లీ మరుసటి రోజు రావడంతో మహిళా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments