Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసుపత్రికి వెళ్తుంటే ఆయువు తీసిన తమిళనాడు ఆర్టీసి బస్సు

Webdunia
శనివారం, 8 మే 2021 (16:18 IST)
గూడూరు గ్రామీణం: ‘ఒంట్లో కాస్త నలతగా ఉంది.. నేను, నాన్న ఆసుపత్రికి వెళ్తున్నాం.. పది గంటలకల్లా వచ్చేస్తాం.. నువ్వు, చెల్లి జాగ్రత్త.. పరిస్థితులు బాగా లేవు.. బయట తిరగకండి.. ఇంట్లోనే ఉండండి’ అంటూ బిడ్డలకు జాగ్రత్త చెప్పింది. ఆపై దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై నెల్లూరుకు బయల్దేరారు. ఈలోపే వారిపై విధికి కన్నుకుట్టింది.

వారు వెళ్తున్న వాహనాన్ని బస్సు ఢీకొనడంతో.. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా- భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన గూడూరు పట్టణ సమీపాన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. కోట మండలం రామచంద్రపురానికి చెందిన కొమ్మలపూడి వెంకటేశ్వర్లు, కృష్ణమ్మ(38) దంపతులు.

వీరికి ఇంటర్మీడియట్‌ చదువుకున్న కుమారుడు, పదో తరగతి అభ్యసిస్తున్న కుమార్తె ఉన్నారు. కృష్ణమ్మకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చూపించేందుకు ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గం మధ్యలోని గూడూరు సమీప జాతీయ రహదారిపై వెళ్తుండగా- వెనుక నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ దుర్ఘటనలో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోగా- కృష్ణమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే కన్నుమూశారు. వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన్ను 108 వాహనంలో గూడూరు ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు మనుబోలు వద్ద పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments