Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్లక్ష్యం ఖరీదు.. నిండు గర్భిణి ప్రాణం, ఆసుపత్రి బయటే మృతి

నిర్లక్ష్యం ఖరీదు.. నిండు గర్భిణి ప్రాణం, ఆసుపత్రి బయటే మృతి
, సోమవారం, 3 మే 2021 (23:08 IST)
రంపచోడవరం, మారేడుమిల్లి: సకాలంలో వైద్యసేవలు అందక నిండు గర్భిణి ఆదివారం మృతి చెందారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
 
వారి వివరాల ప్రకారం.. మారేడుమిల్లి మండలం పూజారిపాకలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి పూజారి విజయకుమారి(26)కి ఆదివారం ఉదయం పురిటినొప్పులొచ్చాయి. దాంతో భర్త కృష్ణారెడ్డి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు.
 
వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, నర్సు సేవలందించారు. పరిస్థితి విషమించడంతో ప్రాంతీయ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ, ఓపీ రాయించుకు రావాలని వైద్యసిబ్బంది కాలయాపన చేయడంతో ఆసుపత్రి బయటే ఆమె సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 
 
వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆశ వర్కర్ల యూనియన్‌ నేత మట్ల వాణిశ్రీ, సెంటర్‌ఫర్‌ రైట్స్‌ అధ్యక్షుడు బాలు అక్కిస ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీదీనా మజాకా? నెక్ట్స్ ప్లాన్‌ అదేనా?