Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కోడలు పడకగదిలో ఏకాంతం.. చూసేసిన అత్త... ఆ తరువాత?

Webdunia
గురువారం, 2 మే 2019 (12:05 IST)
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సాయినగర్ లోని నాలుగోవీధిలో ఉదయ్, అతని భార్య సులోచన, ఉదయ్ తల్లి రాజమ్మ నివాసముంటున్నారు. ఉదయ్, సులోచనలకు పెళ్ళయి సంవత్సరమైంది. అయితే ఉదయ్‌కు మాత్రం ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేసేవాడు ఉదయ్. 
 
ఉన్నట్లుండి ఉదయ్‌కు ఉపాధ్యాయుడి ఉద్యోగం వచ్చింది. అది కూడా పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో. దీంతో భార్య, తల్లిని వదిలిపెట్టి ఉద్యోగం కోసం ఏలూరుకు వెళ్ళాడు ఉదయ్. వారానికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యను సరదాగా బయటకు తీసుకువెళ్ళేవాడు ఉదయ్. ఆ తరువాత యధావిధిగా ఏలూరుకు వెళ్ళిపోయేవాడు.
 
భర్త వారంరోజులకు ఒకసారి రావడంతో సులోచన ఆలోచన పెడదారి పట్టింది. ఇంటి పక్కనే ఉన్న రాజశేఖర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండునెలల పాటు ఎవరికి అనుమానం రానివ్వకుండా ఈ బాగోతాన్ని నడిపింది. అయితే రెండు రోజుల క్రితం తన ఇంట్లోకే ప్రియుడు రాజశేఖర్‌ను పిలిపించుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని రాజమ్మ చూసేసింది.
 
దీంతో అత్తను తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది సులోచన. పోలీసులకు ఫోన్ చేసి దోపిడీ దొంగలు తన అత్తయ్యను హత్య చేశారని చెప్పింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన తల్లిని చంపేసిందని తెలియడంతో ఉదయ్ షాక్ తిన్నాడు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments