Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనవళ్లు వచ్చారన్న ఆనందం: మసాలా అనుకుని పురుగు మందును చికెన్‌లో కలిపేసిన అమ్మమ్మ

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:25 IST)
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన మనవళ్లు ఇంటికి వచ్చారన్న ఆనందంలో ఓ అమ్మమ్మ పొరబాటున చికెన్ మసాలా అనుకుని పురుగుల మందు ప్యాకెట్ పొడిని చికెన్ కూరలో వేయడంతో ఆ కూరను తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా చెర్లపల్లి గ్రామంలో నివాసం వుంటోంది వృద్ధురాలు గోవిందమ్మ. ఆమె కుమార్తె ధనమ్మ ఎ.ఎల్‌ పురంలో వుంటోంది. చాలా కాలంగా కరోనా లాక్ డౌన్‌తో ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. ఐతే ధనమ్మ తన ఇద్దరు కుమారులను తీసుకుని తల్లి ఇంటికి వచ్చింది. మనవళ్లను చూసిన గోవిందమ్మ, వారికి చికెన్ వండిపెట్టాలనుకుంది.
 
చికెన్ తెప్పించి కూర వండుతూ అందులో మసాలా వేసే సమయంలో పొరబాటున పురుగుల మందు ప్యాకెట్టును గరంమసాలా అనుకుని కూరలో కలిపేసింది. ఆ కూరను తిన్న ఇద్దరు పిల్లలు, గోవిందమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఐతే అప్పటికే చిన్నారులిద్దరూ మృతి చెందారు. గోవిందమ్మ పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments