Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బాలుడి కిడ్నాప్, ఆచూకీ చెప్పినవారికి పారితోషికం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (16:50 IST)
తిరుపతిలో ఆరేళ్ళ బాలుడు శివకుమార్ సాహును కిడ్నాప్ చేశారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద కనిపించకుండా పోయాడు చత్తీస్‌ఘడ్‌కు చెందిన బాలుడు. 
 
బాలుడి కిడ్నాప్‌కు సంబంధించిన సి.సి. టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. గత నెల ఫిబ్రవరి 27వ తేదీన శివకుమార్ సాహు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్సనార్థం వచ్చాడు. తిరుమలకు వెళ్ళేందుకు అలిపిరి వద్దనున్న బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద వేచి ఉన్నారు.
 
అయితే సాహు ఆడుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. చిన్నారి కోసం సుమారు రెండు గంటల పాటు తల్లిదండ్రులు వెతికారు. అయితే ఎంతకూ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిసి టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు.
 
గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని తీసుకెళ్ళడాన్ని పోలీసులు గమనించారు. అయితే పోలీసులు రికార్డుల్లో ఆ వ్యక్తి ఎవరన్నది తెలియలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments