Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

Webdunia
సోమవారం, 30 మే 2022 (09:56 IST)
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్నటాటా ఏస్ వాహనం.. రెంటచింతలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టింది. దీంతో అందులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. 
 
ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో టాటా ఎస్ వాహనంలో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
వీరంతా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం చీకటితో పాటు.. డ్రైవర్ రహదారిపై ఆగి ఉన్న ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments