Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం - 75 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (10:52 IST)
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తిరుపతి పట్టణానికి సమీపంలోని ఏర్పేడుకు దగ్గరలో ఈ ఐఐటీ క్యాంపస్ ఉంది. అయితే, ఇక్కడ మొత్తం 75 మందికి ఈ వైరస్ సోకింది. ఈ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 30 మందికి సిబ్బందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. 
 
ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగడంతో విద్యార్థుల వసతి గృహాన్నే కోవిడ్ కేంద్రంగా మార్చివేశారు. వీరందరినీ అక్కడే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది తమతమ సొంతూర్లకు వెళ్లిపోయారు. 
 
ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదేసమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments