Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం - 75 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (10:52 IST)
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తిరుపతి పట్టణానికి సమీపంలోని ఏర్పేడుకు దగ్గరలో ఈ ఐఐటీ క్యాంపస్ ఉంది. అయితే, ఇక్కడ మొత్తం 75 మందికి ఈ వైరస్ సోకింది. ఈ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 30 మందికి సిబ్బందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. 
 
ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగడంతో విద్యార్థుల వసతి గృహాన్నే కోవిడ్ కేంద్రంగా మార్చివేశారు. వీరందరినీ అక్కడే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది తమతమ సొంతూర్లకు వెళ్లిపోయారు. 
 
ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదేసమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments