Webdunia - Bharat's app for daily news and videos

Install App

7గురు మహిళలు, 14మంది కవలలు! ఫెర్టిలిటీలో అరుదైన రికార్డు!!

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:44 IST)
మాతృత్వం అపురూపం.. ప్రతి మహిళా కోరుకునే ఓ వరం... సంతాన యోగం లేక ఏళ్ల తరబడి పిల్లల కోసం పరితపించే దంపతులకు ఆధునిక వైద్యంలో ఫెర్టిలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత మూడేళ్లుగా ఫెర్టిలిటీ వైద్య విధానంలో వందల సంఖ్యలో దంపతులకు సంతాన ప్రాప్తి కలిగిస్తున్న ఖమ్మం బిలీఫ్‌ ఆస్పత్రిలో ఫెర్టిలిటీ వైద్య సేవల్లో అరుదైన రికార్డును నెలకొల్పింది. గత వారం రోజుల్లో ఏడుగురు మహిళలు 14 మంది బిడ్డలను కన్నారు.
 
ఒక్కో మహిళ (ట్విన్స్‌) ఇద్దరిద్దరు చొప్పున సంతానం లభించడం ఇక్క‌డ విశేషం. వీరంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ శృతి మువ్వా తెలిపారు. ఆరుగురు మహిళలకు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ చొప్పున జన్మించగా ఏడవ మహిళకు ఇద్దరు మగపిల్లలు జన్మించారు. దీంతో బిలీఫ్‌ ఆస్పత్రిలో ట్విన్స్‌ పిల్లల పంట పండిందని ఆ పిల్లల దంపతులు, బంధువులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఫెర్టిలిటీ వైద్య విధానంలో ఖమ్మం బిలీఫ్‌ ఆస్పత్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యథిక సంతాన ప్రాప్తి శాతాన్ని నమోదు చేసుకుందని ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ శృతి మువ్వా, డాక్టర్‌ మువ్వా రోహిత్‌ తెలిపారు. అరుదైన రికార్డును సాధించిన డాక్టర్లను హాస్పటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ రమాజ్యోతి అభినందించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments